ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య, కూతురు కలిసి చేసిన కిరాతకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2023, 08:11 PM

అనంతపురం జిల్లా, మడకశిర మండలంలోని కల్లుమర్రి గ్రామానికి చెందిన వృద్ధుడు బోయ హనుమంతప్పను అతడి భార్య అక్కమ్మ, పెద్ద కుమార్తె అనిత హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో సీఐ సురేష్‌ బాబు గురువారం వెల్లడించారు. హనుమంతప్పకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్దకుమార్తె అనితను సురేష్‌ అనే వ్యక్తికిచ్చి వివాహం చేశారు. వారికి సంతానం కలగలేదు. దీంతో రెండో కుమార్తె సంధ్యను పెద్ద అల్లుడైన సురే్‌షకిచ్చి వివాహం చేయాలని, ఆస్తి అంతా తమకే ఉంటుందని అక్కమ్మ, పెద్ద కుమార్తె అనిత పలుమార్లు హనుమంతప్పతో వాదనకు దిగారు. అందుకు హనుమంతప్ప, చిన్న కుమార్తె ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే చిన్న కుమార్తెకు కర్ణాటక వాసితో పెళ్లి చేశారు. దీనిని హనుమంతప్ప భార్య అక్కమ్మ, పెద్దకుమార్తె అనిత జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈనెల 8వ తేదీన ఇద్దరూ కలిసి, షెడ్డు వద్ద ఉన్న హనుమంతప్ప వద్దకెళ్లి, కళ్లలో కారం కొట్టారు. గొడ్డలి కట్టెతో అతడి తల, యద, మర్మాంగంపై విచక్షణారహితంగా కొట్టారు. దీంతో హనుమంతప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్య, కుమార్తె హత్య చేసినట్లు తేల్చారు. దీంతో భార్య అక్కమ్మ, పెద్దకుమార్తె అనితను అరెస్టు చేసి, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఒక్కరోజులోనే కేసును ఛేదించిన సిబ్బందిని సీఐ అభినందించారు. సమావేశంలో ఎస్‌ఐ నాగేంద్ర, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa