జనసేన పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నాలుగు రోజుల పాటు విజయవాడలోనే బస చేయనున్నారు. 14న మచిలీపట్నంలో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు విభాగాల నేతలతో ఆయన ప్రత్యేకంగా ముందుగా సమావేశం కానున్నారు. శనివారం(11న) మధ్యాహ్నం రెండు గంటలకు బీసీ సంక్షేమంపై పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. 12న ఉదయం పార్టీ నాయకులతో సమీక్ష చేస్తారు. కొత్తగా పార్టీలో చేరే వారిని ఆహ్వానిస్తారు. అదే రోజు చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలోని కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో భేటీ అవుతారు. 13వ తేదీ ఆవిర్భావ దినోత్స కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు కొత్త గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ను విజయవాడ రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. 14వ తేదీన ఉదయం మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహి వాహనంపై యాత్రగా బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. మొత్తంగా నాలుగు రోజుల పాటు పవన్ మంగళగిరిలో అందుబాటులో ఉండడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవాడ తరలివస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa