మచిలీపట్నంలో ఈనెల 14న జరగనున్న జనసేన 10వ ఆవిర్భావ దినో త్సవ సభ ఏర్పాట్లను ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్ర వారం పరిశీలించారు. ప్రధాన వేదిక, గ్యాలరీలను పరిశీలించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం చైర్మన్ శ్రీకల్యాణం శ్రీనివాస్కు సూచనలు చేశారు. తిరువూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీ పసుపు లేటి సురేష్, లింగినేని సుధాకర్, షేక్ ఫరీద్, కొల గాని అఖిల్, రామిశెట్టి జగన్, కస్తూరి ఓంకార్, కరీముల్లా, పెడన నియోజకవర్గం చిట్టి గూడూరు మాజీ సర్పంచ్ వేము ఆంజనేయులు తదితరులు నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి మనోహర్ ఆహ్వానించారు. జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, కార్యదర్శి మునుబోలు శ్రీనివాసరావు, బందరు నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa