కడప జిల్లా సిద్దవటం మండలంలోని మూలపల్లి గ్రామం వద్ద శనివారం 692 బస్టాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సిద్దవటం ఎస్సై తులసి నాగ ప్రసాద్ తెలిపారు. మూలపల్లి గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లి దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 692 బస్తాల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న టాటా సుమో, బియ్యాన్ని తరలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు. పట్టుబడిన బియ్యాన్ని తహసీల్దార్ కు అప్పగించునున్నట్లు ఎస్సై తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa