పన్నెండేళ్లుగా తనకు వెన్నుదన్నుగా నిలిచిన అభిమానులకు, కార్యకర్తలకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలావుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 13వ వసంతంలోకి అడుగుపెట్టింది. దీంతో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్య నేతలు జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి.. నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్ చేశారు.
'12 వసంతాలు పూర్తి చేసుకుని.. నేడు 13 వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు, రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. గత 12 ఏళ్లుగా నా ఈ ప్రయాణంలో నాతో నిలబడి.. నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ, మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను' అని జగన్ ట్వీట్ చేశారు.
విశాఖ జిల్లా మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం.. వైఎస్ఆర్ సీపీ జెండాను ఆవిష్కరించారు. వైయస్ఆర్ సీపీ 12 వసంతాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు వైవీ సుబ్బారెడ్డి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa