కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి పిటిషన్ పై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు సంబంధించిన వివరాలను సీబీఐ సీల్డ్ కవర్లో హైకోర్టుకు అందజేసింది. 10 డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, కొన్ని ఫొటోలను కోర్టుకు సమర్పించింది.
వైఎస్ అవినాష్ రెడ్డి విచారణను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేస్తున్నట్లు కోర్టు దృష్టికి సీబీఐ తీసుకొచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంలో వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని.. ఆయనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇవ్వొద్దని హైకోర్టును కోరింది. వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పు వెల్లడించే వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది.
అలాగే, తదుపరి విచారణపై ‘స్టే’ ఇవ్వాలన్న పిటిషన్పైనా ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అలాగే, వైఎస్ భాస్కర్రెడ్డిని విచారణ అంశం హైకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. ఈ కేసు విచారణ హైదరాబాద్కు బదిలీ అయితే కడపకు ఎందుకు పిలిచారని ప్రశ్నించింది. కడపలో విచారణకు తాము పిలవలేదని సీబీఐ తెలిపింది. మరోవైపు సీబీఐ ఆఫీసు వద్ద అవినాష్ ప్రెస్మీట్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు జరుగుతుండగా ప్రెస్మీట్ ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa