ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దాచుకో, దోచుకో అనే పద్ధతిలో చంద్రబాబు పాలన ఉండేది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 01:58 PM

 ప్రజలకు మంచి చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ను విమర్శించడమే పవన్‌ పని అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు  అన్నారు. చంద్రబాబు చేసిన వాగ్ధానాల గురించి పవన్‌ ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. దాచుకో, దోచుకో అనే పద్ధతిలో చంద్రబాబు పాలన ఉండేదని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు. వంగవీటి రంగాను హత్యచేయించింది చంద్రబాబేనని హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారని చెప్పారు, రంగాను హత్య చేసిన వారినే పవన్‌ సమర్ధిస్తున్నారని తప్పుపట్టారు. విశాఖ సమ్మిట్‌ విజయవంతమైతే ఒక్కరైనా అభినందించారా అని ప్రతిపక్షాలను నిలదీశారు. సీఎం వైయస్‌ జగన్‌పై ధ్వేషంతో పవన్‌ మాట్లాడుతున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa