'నాన్నను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరముందని వై.ఎస్.వివేక కుమార్తె సునీత పేర్కొన్నారు. ఈ కేసులో నిజాలు ఖచ్చితంగా బయటికి రావాలి. కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారు. నాకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి డాక్యుమెంట్స్ రూపంలో వెల్లడించా. కుటుంబ సభ్యుల పై ఆరోపణలు చేస్తున్నానని కూడా తెలుసు. హత్య కేసులో ప్రమేయం ఉందని నమ్ముతున్నందునే అన్ని విషయాలు చెప్పా' అని డాక్టర్ సునీత వ్యాఖ్యానించారు.
'సీబీఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నా. నాన్న హత్య పై గతంలో కొందరు తేలిగ్గా మాట్లాడారు. కడప, కర్నూలు వంటి ప్రాంతాల్లో ఇలాంటివి మామూలే కదమ్మా అన్నారు. నాన్నను ఎవరు హత్య చేశారో తెలుసు కోకుండా ఎలా వదిలిపెడతా. 30 ఏళ్ల కిందటి గోడవలు మళ్లీ మొదలవుతున్నాయని అనిపిస్తుంది. తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడాలి. విచారణ సందర్భంగా ఎవరైనా మాట్లాడటం సరికాదు. దర్యాప్తు సంస్థలు, పోలీసుల విచారణ సక్రమంగా జరిగేలా అంతా సహకరించాలి. ఎంతో మంది తెలియకుండానే సహకరిస్తున్నారు.. వారికి కృతజ్ఞతలు' అని సునీత వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa