మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే కడప జిల్లా పులివెందుల పట్టణంలో.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు హాజరయ్యారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. వివేకా వర్ధంతి సందర్భంగా పులివెందుల పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫొటోలు లేకుండా ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే.. అందులో జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, మరో చెల్లి సునీత ఫొటోలు ఉన్నాయి.
వారివే కాకుండా.. రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలు కూడా ఆ ఫ్లెక్సీలో ఉన్నాయి. కానీ.. జగన్, అవినాష్ రెడ్డి ఫొటోలు మాత్రం లేవు. దీంతో అందరూ దీన్ని ఆసక్తిగా చూస్తున్నారు. అటు ఈ ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ విచారణకు కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యం సదరు ఫ్లెక్సీ.. చర్చనీయాంశంగా మారింది. అందులో ఎందుకు జగన్, అవినాష్ రెడ్డి ఫొటోలు పెట్టలేదనే చర్చ జరుగుతోంది. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa