తెనాలి పట్టణానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి వెంకట్రావు పై అతడి భార్య వరలక్ష్మి 2020 జూన్లో ఇనుప రాడ్డుతో దాడి చేసి గాయపరిచింది. దీనికి ఆమె పిల్లలు సహకరించారు. తెనాలి వైద్యశాలలో చికిత్స పొందుతూ వెంకటరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు బుధవారం విచారణకు రావడంతో సాక్షాదారాలను పరిశీలించిన మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ రహమతుల్లా వరలక్ష్మికి రూ. 1, 000 జగిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. పిల్లలపై కేసు కొట్టి వేశారు. ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ ఏపీపీ పరిశపోగు సునీల్ కుమార్ వాదించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa