నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ సభ్యులు , వైసీపీ సభ్యులు మధ్య జరిగిన వాదోపవాదనాలను మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించారని అన్నారు. విభజన వల్ల పెండింగ్లో ఉన్న సమస్యలపై చర్చించారని తెలిపారు. పోలవరం నిధులపై ప్రధానితో సీఎం చర్చించారని పేర్కొన్నారు. సభలో టీడీపీ సభ్యులు అనవసర రాద్దాంతం చేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో పోలవరంలో జరిగిన తప్పులపై చర్చిద్దామా?. చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు, పెట్టిన బకాయిలపై చర్చిద్దామా?’’ అంటూ మంత్రి బుగ్గన సవాల్ విసిరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa