బాబాయ్ హత్యకేసులో అవినాశ్రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం కావడంతో జగన్ కావాలనే టీడీపీ సభ్యులపై శాసన సభలో దాడి చేయించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజల నుంచి జగన్కు చీత్కారం లభించడం కూడా ఇందుకు కారణం’’ అని ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పులివెందులలో కూడా టీడీపీని ఆదరించారన్న ఈర్ష్యా, దేషాలతో డోలా బాల వీరాంజనేయస్వామిపై దాడి జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెడతామంటున్న వారు సభలో జరిగిన దాడి దృశ్యాలను ఏవిధమైన కటింగ్లు లేకుండా విడుదల చేయాలి. టీడీపీ ఎమ్మెల్యేలను కొట్టిన వైసీపీ ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్పీకర్ చేతగాని తనాన్ని, బాగోతాలను ఆమదాల వలసలో ప్రజల ముందు ఎండగడతాం. వెలంపల్లి శ్రీనివాసరావు, సుధాకర్ బాబులు టీడీపీ వారిపై బూతులు మాట్లాడుతూ, దాడికి దిగితే వారిని స్పీకర్ వారించకుండా, సస్పెండ్ చేయకుండా మిన్నకుండిపోయారు. నాలుగు సంవత్సరాల నుంచి కళ్లుమూసుకున్న స్పీకర్ ఇప్పటికైనా అధికార పార్టీ ఎమ్యెల్యేలపై చర్యలు తీసుకోవాలి. లేదంటే జరిగిన దారుణంపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం. దారుణంగా వ్యవహరిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ అధికారంలోకి రాంగానే దబిడి దిబిడి జరుగుతుంది. ఇంతకు ఒకటిన్నర రెట్లుగా స్పందిస్తామని’’ బుద్దా వెంకన్న హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa