ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ పాలనలో ముస్లింలకు ఏం మేలు చేశారో..? బహిరంగ చర్చకు సిద్ధమా...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 01:33 PM

టీడీపీ అధికారంలోకి రాగానే ముస్లిం బ్యాంకు ఏర్పాటు చేస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ ప్రకటించారు. కదిరిలోని ఓ ఫంక్షన హాల్‌లో ముస్లింలతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. వైసీపీ అధికారం చేపట్టాక వాటిని రద్దు చేయడంతోపాటు ముస్లింలను అణచి వేసిందన్నారు. వైసీపీ పాలనలో ముస్లింలకు ఏం మేలు చేశారో..? బహిరంగ చర్చకు తాము సిద్ధమనీ, ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా సిద్ధమా అని సవాల్‌ విసిరారు. వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్‌ అధికారాలిచ్చి, ఆస్తులకు రక్షణ కల్పిస్తామన్నారు. ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటు చేయడంతోపాటు షరతులు లేకుండా దుల్హన పథకాన్ని అమలు చేస్తామన్నారు. టీడీపీ హయాంలో హజ్‌హౌ్‌సను నిర్మించి, హజ్‌ యాత్రకు సాయం అందించామన్నారు. అమ్మ ఒడి డబ్బులు కూడా ముస్లింల సంక్షేమానికి ఖర్చు చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో ముస్లింలపై దాడులు పెరిగిపోయాయన్నారు. పలమనేరులో ఓ వైసీపీ నేత తన కూతురుకన్నా ఓ ముస్లిం బాలికకు ఎక్కువ ర్యాంకు వచ్చిందన్న అక్కసుతో ఆ కుటుంబాన్ని వేధించడం చూసి బాలిక ఆత్మహత్య చేసుకుందన్నారు. కదిరిలో రూ.18 కోట్లతో ముస్లిం రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటు చేసింది టీడీపీ ప్రభుత్వమే అన్నారు. రూ.15 కోట్లతో ముస్లిం పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేశామనీ, మిగిలిన పనులు పూర్తి చేయని అసమర్థ ప్రభుత్వం వైసీపీది అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa