ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 01:34 PM

మరణంలోనూ వీడని స్నేహ బంధం, ఘటనతో కన్నీరు మున్నీరవుతున్న కుటుంబసభ్యులు . వివరాల్లోకి వెళితే..శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం నూకనపల్లి గ్రామానికి చెందిన యలకచర్ల అరుణ్‌ (26) చెన్నైలోని ఓ సెల్‌ఫోన్‌ కంపెనీలో పనిచేస్తూ భార్యతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. కలువాయి మండలం నూకనపల్లి అరుంధతీయ కాలనీకి చెందిన యలకచర్ల చిన్న రేణుయ్య, అనంతమ్మల కుమారుడు అరుణ్‌ 10వ తరగతి వరకు చదువుకున్నాడు. 9 నెలలు క్రితం అరుణ్‌కు కలువాయి మండలం తెలుగురాయపురానికి చెందిన అనూషతో వివాహమైంది. ప్రస్తుతం అనూష గర్భవతిగా ఉంది. కాగా, ఐదేళ్లుగా అరుణ్‌ చైన్నైలోని ఓ సెల్‌ఫోన్‌ కంపెనీలో చేస్తున్నాడు. ఆదివారం ఉదయం సొంత పనిమీద బైక్‌పై స్వగ్రామానికి వచ్చాడు. భార్యకు చెందిన మెడికల్‌ రిపోర్టులు తీసుకుని సాయంత్రం తిరుగు పయాణమయ్యాడు. ఆ సమయంలో ఉపాధి కోసం తన స్నేహితుడు దండు వెంకటరమణ (25) వస్తాననడటంతో ఇద్దరూ బైక్‌పై చెన్నైకు బయలుదేరారు.రాష్ట్ర సరిహద్దులో అర్ధరాత్రిపూట డివైడర్‌ను బైక్‌ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa