ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రగ్‌ మాఫియాగా మారిన కాకినాడ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 01:35 PM

కాకినాడ పరిసర ప్రాంతాలలో ప్రతి రోజు ఏదో ఒక చోట, గంజా , డ్రగ్స్ వంటి మత్తుపదార్ధాలు పోలీసులకి చిక్కుతునే ఉన్నాయ్. తాజాగా బెంగళూరు నుంచి కాకినాడకు మెథలీన్‌డైక్సీ మెథాఫెటమైన్‌ డ్రగ్‌ సరఫరా చేస్తున్న ముగ్గురిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడలో ఇంజినీరింగ్‌ చదివిన ఓ యువకుడు బెంగళూరులో స్థిరపడ్డాడు. బెంగళూరు కేంద్రంగా ఎండీఎంఏ డ్రగ్‌ను తయారు చేసి యువతకు సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలో కాకినాడకు చెందిన ఓ యువకుడు కొద్దిరోజుల క్రితం బెంగళూరు వెళ్లి 15గ్రాముల డ్రగ్‌తో బస్సులో వస్తూ విజయవాడ బస్టాండ్‌లో దిగాడు. అనుమానాస్పదంగా ఉన్న అతడతిని పోలీసులు తనిఖీ చేయగా రూ.60 వేల విలువైన డ్రగ్‌ లభించింది. అతడిచ్చిన సమచారంతో బెంగళూరులో ఎండీఎంఏ తయారు చేస్తున్న యువకుడితోపాటు కాకినాడకు చెందిన మరో యువకుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఎండీఎంఏను గ్రాము రూ.2 వేల నుంచి 4 వేల వరకు విక్రయిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa