ఇంతకాలం పార్టీకి అంటిఅంటన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న వాదనల నేపథ్యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఇదిలావుంటే అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో పార్టీకి చెందిన కీలక నేతలు పాల్గొని లోకేష్కు మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా.. మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత గంటా శ్రీనివాస రావు లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని సంఘిభావం ప్రకటించారు. లోకేష్తో కలిసి కొంత దూరం నడిచారు. ఆయన తోపాటు.. విశాఖ జిల్లాకు చెందిన కొందరు నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు.
కొన్నాళ్లుగా గంటా శ్రీనివాస రావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే.. పార్టీ మార్పు అంశంపై గంటా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు. తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి అనారోగ్య సమస్యలే కారణమని స్పష్టం చేశారు. దీంతో పార్టీ మార్పు చర్చ తగ్గింది. ఈ నేపథ్యంలోనే టీడీపీకి చెందిన అభ్యర్థులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో గతంలో పార్టీకి దూరంగా ఉన్న నేతలు.. మళ్లీ యాక్టివ్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి గంటా లోకేష్ పాదయాత్రలో పాల్గొనడంతో తెలుగు తమ్ముళ్లలో మరింత జోష్ పెరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa