ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో మూడు కొత్త పాలిటెక్నిక్ కాలేజీలుం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 04:42 PM

రాష్ట్రంలో రూ. 100 కోట్లతో మరో మూడు పాలిటెక్నిక్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ గెజిట్‌ విడుదల చేశారు. ఈ వివరాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వివరించారు.  నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైఎస్సార్‌ జిల్లా మైదుకూరుల్లో నూతనంగా పాలిటెక్నిక్‌ కాలే­జీలను ఏర్పాటు చేయనున్నట్లు బుగ్గన రాజేంద్రనాత్ రెడ్డి వెల్లడించారు. ఈ కాలే­జీలు అందుబా­టులోకి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, మెటలర్జికల్‌ విభాగాల్లో డిప్లొమా కోర్సుల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ముఖ్యంగా రాలయసీమలోని గ్రామీణ యువతకు మరింత వెసులు­బాటు ఉంటుందన్నారు.


నూతన పాలిటెక్నిక్ కళాశాలల ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ విద్యార్థులకు మరింత మెరుగుపడి విద్య పూర్తవ­గానే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని మంత్రి బుగ్గన తెలిపారు. మంజూరైన 3 పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఒకదాన్ని రూ. 30 కోట్లతో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న డోన్‌ నియోజకవర్గ పరిధిలోని బేతంచెర్లలో ఏర్పాటు చేస్తుండటం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 3 కాలేజీలను వెనుక­బడిన రాయలసీమ ప్రాంతానికే కేటాయించడం పట్ల ధన్యవాదాలు చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa