ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలి,,,తెలుగు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ శుభాకాంక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 09:23 PM

శ్రీ శోభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా.. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. 'షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్లలో నూతన సంవత్సర శోభను తెస్తూ, కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు, ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తుకు, తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలి. శోభకృత్ నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలి' అని సీఎం జ‌గ‌న్‌ అభిలషించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa