ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాసనమండలిలో తారుమారైన పార్టీల బలబలాలు.... మెజార్టీ స్థానల్లో వైసీపీ.. కొన్నింటికే టీడీపీ పరిమితం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2023, 04:49 PM

శాసనమండలిలో పార్టీల  బలబలాలు తారుమారయ్యాయి. ఇదిలావుంటే  ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాయి.. అటు టీచర్, పట్టభద్రులు.. ఇటు గవర్నర్, ఎమ్మెల్యే కోటా పూర్తయ్యింది. ఈ ఎన్నికల తర్వాత శాసమండలిలో కూడా పార్టీల బలాబలాలు మారిపోయాయి.. వైఎస్సార్‌సీపీకి ప్లస్ కాగా, టీడీపీకి మైనస్ అయ్యింది. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58 కాగా.. వీరిలో వైఎస్సార్‌సీపీ సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 33 నుంచి (గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయిన వారితో కలిపి) 45కు చేరుకోనుంది. ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్సీల సంఖ్య 17 నుంచి 10కి తగ్గనుంది. పీడీఎఫ్‌కు ప్రస్తుతం ఐదుగురు సభ్యులుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య రెండుకు తగ్గింది. ఇండిపెండెంట్ ఒకరు ఉన్నారు. ఇక బీజేపీకి ఉన్న ఒక్క సభ్యుడూ కూడా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.


తాజాగా ఎన్నికల విషయానికి వస్తే.. స్థానిక సంస్థల కోటాలో 9, ఎమ్మెల్యే కోటాలో 7, పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2. ఇవన్నీ కలిపితే మొత్తం 21 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో 17 స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలుచుకోగా.. టీడీపీ 4 స్థానాలను దక్కించుకుంది. అయితే జులైలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు (గవర్నర్ కోటాలో) ఖాళీ అవుతున్నాయి.. అవి కూడా కలిపితే వైఎస్సార్‌సీపీ బలం 47 (టీచర్స్‌ ఎమ్మెల్సీలతో కలుపుకుని వైఎస్సార్‌సీపీ బలం)కు చేరనుంది. 2019లో అధికారంలోకి వచ్చే నాటికి మండలిలో వైయస్సార్‌సీపీ బలం 9 కాగా.. ఇప్పుడు ఏకంగా 47కు పెరగబోతోంది.


వైఎస్సార్‌సీపీ కూడా మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతోంది. మొత్తం 21 ఎమ్మెల్సీలలో అధికార పార్టీ 17 దక్కించుకుంటే.. టీడీపీకి కేవలం నలుగు మాత్రమే గెలుచుకుందని గుర్తు చేస్తున్నారు. మండలిలో తమ బలం మరో మూడు నెలల్లో 47కు పెరుగుతుందంటున్నారు. అయితే టీడీపీ మాత్రం తమకు వచ్చింది నాలుగు ఎమ్మెల్సీలు అయినా ప్రజల్లో జగన్ సర్కార్‌పై వ్యతిరేకతకు సంకేతమని వ్యాఖ్యానిస్తోంది.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 21 స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో స్థానిక సంస్థల కోటాలో 9 కాగా.. ఎమ్మెల్యేల కోటాలో 7 స్థానాలు ఉన్నాయి. మిగిలిన ఐదు స్థానాలు టీచర్, గ్రాడ్యుయేట్స్ స్థానాలు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మొత్తం 17 గెలుచుకుంది.. వీటిలో స్థానిక సంస్థల కోటాలో అన్ని స్థానాల (9)ను గెలుచుకుంది. ఎమ్మెల్యేల కోటాలో ఆరు వైఎస్సార్‌సీపీకి వచ్చాయి.. ఇక మిగిలిన టీచర్, గ్రాడ్యుయేట్స్ స్థానాల్లో టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను వైఎస్సార్‌సీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ ఎమ్మెల్యే కోటాలో ఒకటి.. గ్రాడ్యుయేట్స్ కోటాలో మూడు ఎమ్మెల్సీలను దక్కించుకుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa