ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ ఆ నలుగురు ఎమ్మెల్యేలను.... పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2023, 06:08 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు  పాల్పడ్డిన ఎమ్మెల్యేల విషయంలో   వైఎస్సార్సీపీ చీఫ్.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని అనుమానించిన నలుగురు ఎమ్మెల్యేలను.. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు.. పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. అంతర్గత విచారణలో వీరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారణ అయ్యిందని సజ్జల వ్యాఖ్యానించారు.


అయితే.. కొన్నాళ్లుగా ఆనం, కోటంరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు ఎలాగూ తమకు సపోర్ట్ చేయబోరని పార్టీ భావించింది. కానీ.. కొత్తగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పేర్లు తెరపైకి రావడం సంచలనంగా మారింది. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు గురువారం సాయంత్రమే ఆరోపణలు వచ్చాయి. కానీ.. ఉండవల్లి, మేకపాటి వాటిని ఖండించారు. తాము క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని వివరణ ఇచ్చారు. కానీ.. పార్టీ సంతృప్తి చెందలేదు. దీంతో సస్పెన్షన్ వేటు వేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa