ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిద్ధూ భార్య నవజ్యోత్‌కు క్యాన్సర్ స్టేజ్ 2,,,జైల్లో ఉన్న సిద్ధూను ఉద్దేశించి భావోద్వేగ పోస్టు

national |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2023, 09:25 PM

చేయని నేరానికి జైల్లో ఉన్నావు. నీ రాక కోసం ఎదురు చూస్తూ నేను రోజులు లెక్కబెట్టుకుంటున్నాను. నీ బాధను కాస్త పంచుకోమని నువ్వు అడిగావు. కానీ, నన్ను క్షమించండి. ఇక నీ కోసం ఎదురుచూసే పరిస్థితి లేదు. ఎందుకంటే నాకు క్యాన్సర్ స్టేజ్-2 అని తేలింది.. - నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవ్‌జ్యోత్ కౌర్ వ్యాఖ్యలివి. తాను క్యాన్సర్ బారినపడ్డాడని, అది కూడా స్టేజ్ 2గా వైద్యులు నిర్ధారించారని ట్విట్టర్ వేదికగా ఆమె తెలిపారు. తన భర్త, కాంగ్రెస్ నేత, టీమిండియా మాజీ క్రికెటర్ సిద్ధూ.. జైల్లో ఉన్న నేపథ్యంలో ఆమె భావోద్వేగంగా ట్వీట్ చేశారు. దీంతో ఆమె ట్వీట్ వైరల్‌గా మారింది. సిద్ధూ అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ పోస్టులు చేస్తున్నారు.


తనకు ఇన్వేసివ్ క్యాన్సర్ సోకిందని డాక్టర్ నవ్‌జోత్ సిద్ధూ తెలిపారు. ‘అతడు (నవజ్యోత్ సింగ్ సిద్ధూ) చేయని నేరానికి జైలులో ఉన్నాడు. మీ కోసం ఎదురుచూస్తూ రోజూ మీ కంటే ఎక్కువగా బాధ పడుతున్నాను. మీ బాధను దూరం చేసేందుకు ఎప్పటిలాగే నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మీ బాధను దూరం చేయడానికి, దాన్ని పంచుకోమని మీరు అడిగారు. ఈ ప్రయత్నంలో చిన్న ఎదుగుదల కనిపించింది. కానీ, ఇదొక చేదు వార్త’ అని నవ్‌జోత్ రాసుకొచ్చారు.


‘నీ కోసం ఎదురుచూశాను. నీకు పదే పదే న్యాయం జరగకుండా పోయింది. నిజం చాలా శక్తివంతమైనది. కానీ, అది నీకు పదే పదే పరీక్షలను పెడుతోంది. కలియుగం. క్షమించండి.. నేను మీ కోసం వేచి ఉండలేను. ఎందుకంటే, ఇది స్టేజ్ 2 ఇన్వేసివ్ క్యాన్సర్. ఈ రోజే నేను కత్తి కిందకి వెళుతున్నాను (సర్జరీ). ఎవరినీ నిందించాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది దేవుడి ప్లాన్. అది పర్‌ఫెక్ట్’ అని ఆమె ఎమోషనల్‌గా పోస్టు చేశారు. నవజ్యోత్ ట్వీట్‌పై పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘మీరు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడం బాధాకరం. అయితే, ఇది సమయానికి గుర్తించడం ఊరట కలిగించే విషయం. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.


34 ఏళ్ల కింద జరిగిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు కిందటేడాది మే 19న జైలు శిక్ష విధించింది. ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో సిద్ధూను పాటియాలాలోని సెంట్రల్ జైలులోని బ్యారక్ నెం. 10లో ఉంచారు. సిద్ధూ తన రాజకీయ జీవితాన్ని 2004లో ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికలలో అమృత్‌సర్ నుంచి బీజేపీ టిక్కెట్‌పై సిద్ధూ పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. పంజాబ్‌లో అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పదవి నుంచి వైదొలిగారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa