Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Mon, Mar 27, 2023, 08:20 AM
ఏపీ సీఎం జగన్ రెండ్రోజుల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఈరోజు, రేపు ప్రకాశం, విజయవాడ, విశాఖ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 10.55 గంటలకు ప్రకాశం జిల్లా కారుమంచి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి విజయవాడ చేరుకుని గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. అలాగే రేపు సాయంత్రం 6 గంటలకు విశాఖ వెళ్లనున్నారు. రాడిసన్ బ్లూ రిసార్ట్స్ లో జీ20 ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa