బెజవాడ బార్ 117వ అధ్యక్ష, కార్యదర్శులుగా కేబీ సుందర్, జన్ను శ్రీధర్, మహిళా కార్యదర్శిగా పి.జయలక్ష్మి ఎన్నికయ్యారు. బార్ కోశాధికారిగా బత్తుల వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన పోలింగ్లో 2432 ఓట్లకు గాను 1692 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం5 గంటలనుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. వీఎన్వీ రాజ్యలక్ష్మిపై పి.జయలక్ష్మి 8 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బార్ ఉపాధ్యక్షులుగా పుప్పాల శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా పగడాల ఆంజనేయులు గెలుపొందారు. జాయింట్ సెక్రటరీగా నరహరిశెట్టి జ్యోతి, లైబ్రేరియన్ సెక్రటరీగా ఆకుల పాండురంగవిఠల్ ఎన్నికయ్యారు. నూతన కమిటీని బార్ న్యాయవాదులు అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa