సీఎం జగన్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రాడిసన్ బ్లూ హోటల్లో ప్రారంభం కానున్న జీ–20 సదస్సుకు హాజరుకానున్నారు. సాయంత్రం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి గన్నవరం చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి సాయంత్రం 5.15 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రుషికొండలో గల రాడిసన్ బ్లూ హోటల్కు చేరుకుంటారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు జీ–20 సదస్సుకు వచ్చే 20 దేశాల ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. అనంతరం జరిగే ‘గాలా డిన్నర్’లో పాల్గొని విదేశీ అతిథులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సదస్సునుద్దేశించి సీఎం వైయస్ జగన్ మాట్లాడనున్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు రుషికొండ రాడిసన్ బ్లూ రిసార్ట్స్ నుంచి బయలు దేరి 8.35 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి విమానంలో గన్నవరం చేరుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa