ట్రెండింగ్
Epaper    English    தமிழ்

థాంక్యూ సీఎం సర్, దళిత క్రైస్తవుల సంబరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2023, 02:22 PM

దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించే విధంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినందుకుగానూ సీఎం జగన్ కి ప్ర‌వాసాంధ్ర ద‌ళిత క్రిస్టియ‌న్లు కృతజ్ఞతలు తెలియజేశారు. యూఏఈలోని ప్రవాసాంధ్ర దళిత క్రిస్టియన్లు.. ఆంధ్రప్రదేశ్‌ సీఎం  జగన్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. బుర్‌ దుబాయ్‌లోని వెస్ట్‌ జోన్‌ సూపర్‌ మార్కెట్‌ దగ్గర పార్క్‌లో ఈ కృతజ్ఞతా సభ జరిగింది. సీఎం జగన్‌ ఫొటోకు పాలాభిషేకం చేసి.. అనంతరం వాళ్లు ప్రసంగించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు వాళ్లు. ఈ  కృతజ్ఞత సభకు యూఏఈ  వైయ‌స్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ..  సీఎం వైయ‌స్‌ జగన్‌ నాయకత్వంలోని ప్రభుత్వం, అన్ని వర్గాలకు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమాన అవకాశాలు, సమ న్యాయము చేస్తూ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుంది అని తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa