కైకలూరు మండలం, కొల్లేటికోట గ్రామం లో వేంచేసియున్న శ్రీ పెద్దింటి అమ్మవారి ఆలయ హుండీలు లెక్కించడం జరుగుతుందని ఆలయ ఈఓ గోపాలరావు మంగళవారం తెలిపారు. జాతర ఉత్సవముల అనంతరం శ్రీ అమ్మవారి దేవస్థానం నందు నెలకొల్పబడిన హుండీలను ఈ నెల 29వ తేదీ బుధవారం ఉదయం గం. 10. 00 లకు తనిఖీ అధికారి దేవదాయ ధర్మదాయ శాఖ, గుడివాడ వారి పర్యవేక్షణలో, సదరు ధర్మకర్తల మండలి ఛైర్మన్ మరియు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ఆలయ సిబ్బంది సమక్షంలో హుండీలు తెరిచి భక్తులు సమర్పించిన కానుకలు, మ్రొక్కు బడులను లెక్కించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు లెక్కింపులో డ్రస్ కోడ్ తో పాల్గొవాలని ఆలయ కార్యనిర్వహణాధికారి కె. వి. గోపాల రావు ఒక ప్రకటనలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa