ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఢిల్లీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి,,,రెండు వారాల వ్యవధిలోనే రెండోసారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2023, 04:56 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే.. ఈనెల 17న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన జగన్.. రెండు వారాల వ్యవధిలోనే మళ్లీ ఢిల్లీ వెళ్లనుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి పర్యటనలో.. మళ్లీ ప్రధాని మోదీ, అమిత్ షా తో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం వీరిద్దరితో జగన్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటన అజెండాపై ఇంకా స్పష్టత రాకపోయినా.. జగన్ ఢిల్లీ టూర్‌పై సర్వత్రా అసక్తి నెలకొంది.


ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో.. ఏపీకి సంబంధించి రెండు కీలక అంశాలపై కేంద్రం ప్రకటనలు చేసింది. ప్రత్యేక హోదా కుదరదని.. స్పష్టం చేసింది. మరోవైపు పోలవరం ఎత్తు గురించి కేంద్రమంత్రి ప్రకటన చేశారు. ఈ ప్రకటనల నేపథ్యంలో.. జగన్ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు.. సోమవారం సాయంత్రం జగన్.. రాష్ట్ర గవర్నర్‌తో భేటీ అయ్యారు. బడ్జెట్, జీ-20 సదస్సు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. గవర్నర్‌తో భేటీ అయిన రెండు రోజుల్లోనే ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa