రాహుల్ గాంధీ కేసును నిశితంగా గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ సహా ప్రజాస్వామ్య విలువలు, భాగస్వామ్య నిబద్ధతలో భారత ప్రభుత్వంతో అమెరికా నిమగ్నమై ఉందని వ్యాఖ్యానించారు. భారత పార్లమెంట్ నుంచి రాహుల్ గాంధీని బహిష్కరించడం గురించి అడిగిన ప్రశ్నకు వేదాంత్ పటేల్ సమాధానం ఇస్తూ..‘చట్టబద్ధమైన పాలన, స్వాతంత్ర న్యాయవ్యవస్థ పట్ల గౌరవం ఏ ప్రజాస్వామ్యానికైనా మూలస్తంభం.. భారత కోర్టుల్లో గాంధీ (రాహుల్ గాంధీ) కేసును మేము గమనిస్తున్నాం’ అని అన్నారు.
2019 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ సహా ప్రజాస్వామ్య విలువలకు మా భాగస్వామ్య నిబద్ధతపై భారత ప్రభుత్వంతో అమెరికా నిమగ్నమై ఉంది.. భావప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణ సహా మేము ప్రజాస్వామ్య సూత్రాల ప్రాముఖ్యతను, రెండు ప్రజాస్వామ్యాలను బలోపేతం చేయడానికి కీలకంగా వ్యవహరిస్తూనే ఉన్నాం’ అని వేదాంత్ పటేల్ అన్నారు.
భారత్తో లేదా రాహుల్ గాంధీతో మాట్లాడారా? అని అడిగితే.. ‘నాకు ఈ విషయంలో నిర్దిష్టమైన సమాచారం ఏవీ లేదు.. అయితే వీటిలో కొన్ని కొంత కాలం పాటు ఈ విభాగాన్ని కవర్ చేశాయని మీకు తెలుసునని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.. ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉన్న ఏ దేశంలోనైనా ప్రతిపక్ష పార్టీల సభ్యులతో చర్చించడానికి నిర్దిష్ట ప్రమాణం లేదు.’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa