ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని అక్రమ రవాణా చేసి అనపర్తి పరిసరాల్లో విక్రయిస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను మంగళవారం అనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం అన పర్తికి చెందిన శివకోటి సురేష్కుమార్, అడబాల వెంకట దుర్గారావు, సమ్మంగి హరీం ద్ర, దుక్కా వీరబాబులు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి అనపర్తి పరిసరాల్లో విక్రయిస్తున్నారని, ఈ క్రమంలో మంగళవారం అనపర్తిలోని బాపనమ్మ గుడి సమీపంలోని పుంత రోడ్డులో గంజాయి పంచుకుంటున్నారని అందిన సమాచా రం మేరకు తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా, గంజాయి పంచుకుంటు న్న నలుగురినీ అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 24 కిలోల గంజాయిని, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. కేసును అనపర్తి సీఐ శ్రీనివాస్ దర్యాప్తు చేస్తున్నారని నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa