కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్లనే మంగళగిరి ఎయిమ్స్ లో సెక్యూరిటీ గార్డ్స్ ను తొలగించడం జరిగిందని సిఐటియు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వై నేతాజీ అన్నారు. ఎయిమ్స్ లో తొలగించిన సెక్యూరిటీ గార్డ్స్ ను పనిలోకి తీసుకోవాలని కోరుతూ ఎయిమ్స్ సెక్యూరిటీ అసోసియేషన్, సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎయిమ్స్ గేటు వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి మూడో రోజు చేరాయి.
దీక్షా శిబిరాన్ని నేతాజీ ప్రారంభించి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న గార్డులను ఎందుకు తొలగించారో తెలియజెప్పే జీవోను అధికారులు మనకు చూపించాలని డిమాండ్ చేశారు. అధికారులు ఎందుకు చూపించడం లేదని విమర్శించారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు అరికట్టే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదని విమర్శించారు.
పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వలన అన్ని నిత్యవసర వస్తువులు ధరలు పెరుగుతాయని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యపై జోక్యం చేసుకోవాలని కోరారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ ఎస్ చెంగయ్య మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ సమస్య గురించి పట్టించుకోవడంలేదని విమర్శించారు. పనిలోకి తీసుకునే అంతవరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
దీక్షలో పి. వెంకటేశ్వరరావు, కెవిఎస్ కిరణ్, బివిఎల్ నారాయణ, ఎస్ దేవయ్య, జి. ఆరోను పాల్గొన్నారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి వై కమలాకర్, సిఐటియు నాయకులు టి శ్రీనివాసరావు, షేక్ జానీ భాష దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు. సెక్యూరిటీ అసోసియేషన్ నాయకులు జి కోటేశ్వరరావు, పి శివశంకర్, పి సాంబశివరావు, ఆర్ రంగారావు, యు. వెంకటేశ్వరావు, కే. బుజ్జి బాబు, కే. వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa