ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం వైసీపీ, టీడీపీ మధ్య ఆరోపణ, ప్రత్యారోపణల వార్ కొనసాగుతోంది. వైఎఎస్సార్సీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ.. టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని.. దమ్ముంటే వారి పేర్లు బయట పెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. YSRCP ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చంద్రబాబు మైడ్ గేమ్ అడుతున్నారని ఫైర్ అయ్యారు. అచ్చెన్నాయుడుకు తెలివి లేదు.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేనికి పనికిరాని దద్దమ్మ అచ్చెన్నాయుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే మీతో టచ్లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టాలని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సవాల్ విసిరారు.
'ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారంటూ నాటకానికి తెరతీస్తున్నారు. డబ్బుకు అమ్ముడుపోయిన వారు పార్టీ నుంచి వెళ్లిపోయారు. చెరో పది కోట్లు తీసుకుని తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు. మాది రాజకీయ కుటుంబమైనా.. వైఎస్ జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచా. పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. మంత్రిగా పనిచేశా.. జగన్ నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తారు. అసలు నేను పార్టీ మారడం ఏంటి? 2012లో ఉప ఎన్నికల్లో కోవూరు నుంచి గెలిచా.. నా చివరి రక్తపు బొట్టు వరకూ జగన్తోనే ఉంటా' అని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa