ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం హాట్ హాట్గా ఉంది. ప్రధాన పార్టీలు వైఎస్సార్సీపీ, టీడీపీ ఎన్నికల యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి. ఎన్నికల కోసం గట్టి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాయి. ఇటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా 2024 ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే.. ఎన్నికల కోసం సీఎం పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో.. మంత్రివర్గంలో మార్పులకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. మంత్రులుగా ఎవరికి అవకాశం ఇస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది.
ఇప్పుడు ఒకవేళ మంత్రివర్గంలో మార్పులు జరిగితే.. ఇద్దరు పాత మంత్రులకు మళ్లీ అవకాశం ఇవ్వొచ్చు అనే టాక్ వినిపిస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని కి మళ్లీ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. ఈ ఇద్దరిని తీసుకునేది ఎన్నికల కోసమే అనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు ఒక్కరు కూడా మంత్రిగా లేరు. గతంలో కొడాలి నాని ఉన్నా.. ఆయన్ను తప్పించారు. దీంతో మళ్లీ ఆయనకు మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
మరోవైపు.. మర్రి రాజశేఖర్కు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ.. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో.. మర్రికి మంత్రి పదవీ కష్టమేనని తెలుస్తోంది. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కేబినెట్లోని తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ సస్పెండ్ చేసింది. వారందరూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు కావడం గమనార్హం. అయితే.. అదే సామాజికవర్గానికి చెందిన నల్లపురెడ్డికి మంత్రి పదవి ఇస్తే.. ఎలా ఉంటుందన్న దానిపై అధిష్టానం ఆరా తీస్తున్నట్టు సమాచారం.
మళ్లీ ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపై రకరకాల ప్రచారం జరుగుతున్నా.. ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరికి ఉద్వాసన పలుకుతారనేది మాత్రం ఉత్కంఠగా మారింది. మళ్లీ ముగ్గుర్ని మంత్రి వర్గంలోకి తీసుకోవాలంటే.. ప్రస్తుతం ఉన్నవారిలో ముగ్గురిని బయటకు పంపాలి. వారు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. ఉభయ గోదావరి జిల్లాకు చెందిన మంత్రుల్లో ఒకరికి ఎగ్జిట్ ఖాయం అనే చర్చ అయితే జరుగుతోంది. మొత్తానికి మంత్రివర్గంలో మార్పులతో.. ఏపీలో రాజకీయ మరింత వేడెక్కే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa