ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గత రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. సుమారు 40 నిముషాల పాటు అమిత్ షా నివాసంలో జగన్ గడిపారు. అయితే తొలుత నేటి ఉదయం 9:30 గంటలకు జగన్ విజయవాడకు బయలుదేరుతారని మీడియాకు సమాచారం ఇచ్చారు కానీ సడెన్గా ఆయన పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. మరికొద్ది సేపటి లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను ఆయన కలవనున్నారు. నిర్మల భేటీ అనంతరం ఆయన విజయవాడ బయలుదేరుతారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa