ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన్యం బంద్‌ పూర్తిగా విజయవంతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 01:38 PM

బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చవద్దని, ప్రభుత్వం నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం ఆదివాసీ, గిరిజన ప్రజా సంఘాలు తలపెట్టిన రాష్ట్ర మన్యం బంద్‌ పూర్తిగా విజయవంతం అయ్యింది. ఏజెన్సీ వ్యాప్తంగా గిరిజనులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను దుకాణాలను, పాఠశాలలను, కళాశాలలను, దుకా ణాలను, పెట్రోల్‌ బంక్‌లను మూయించివేశారు. ఆదివాసీలకు న్యాయం జరి గేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన ఎమ్మెల్యేలు, ఇతర గిరిజన ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు బంద్‌ కారణంగా ఏజెన్సీలో ప్రయాణికులు నరకయాతన పడ్డారు. బుట్టాయగూడెం మండల కేంద్రానికి వచ్చే ప్రధాన రహదారులపై చెట్లను నరికి అడ్డంగా వేసి పూర్తిగా నిర్బంధించారు. కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాల యాన్ని మూయించారు. బుట్టాయగూడెంలో వైసీపీ తప్పా మిగిలిన అన్ని పార్టీల వారు పాల్గొని మద్దతు తెలిపారు. ముస్లింలు బంద్‌కు మద్దతు ఇచ్చా రు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa