ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎండీఎస్‌యూ ఆపరేటర్ల నిరసనలు,,రేషన్ పంపిణీ నిలిచింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 08:40 PM

ఏపీలో ఎండీఎస్‌యూ ఆపరేటర్ల నిరసనలు దిగారు. దీంతో ఏపీలో రేషన్ తీసుకునేవారికి ముఖ్యమైన గమనిక. ఎండీయూ (ఇంటింటికీ రేషన్‌ పంపిణీ వాహనాలకు)లు నిలిచిపోనున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వాహనాల ఆపరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. వాహన బీమాకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఒక్కో ఎండీయూకు రూ.18వేల నుంచి రూ.23వేల వరకు బ్యాంకు అధికారులు మినహాయించుకుంటున్నారని వాహనాల ఆపరేటర్లు చెబుతున్నారు. తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. శనివారం రేషన్ పంపిణీని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎండీయూలు నిలిచిపోవడంతో రాష్ట్రంలో ఇంటింటికి రేషన్‌ సరఫరా కూడా నిలిచిపోనుంది.


ఎండీయూలు ఆగిపోవడంతో డీలర్ల ద్వారా పంపిణీ చేస్తారా లేదా అన్నది క్లారిటీ లేదు. రేషన్‌ పంపిణీకి ఎలాంటి ఇబ్బందీ లేదని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అంటున్నారు. వాహన బీమాతో పాటు ఇతర సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు ఏపీ సమైక్య ఎండీయూ ఆపరేటర్ల యూనియన్‌.. శనివారం వాహనాల ద్వారా పంపిణీ నిలిపేస్తామని తెలిపారు. అలాగే గుండెపోటుతో, అనారోగ్యంతో చనిపోయిన 57 మంది ఆపరేటర్ల కుటుంబాలకు బీమా సదుపాయం కల్పించాని డిమాండ్ చేస్తున్నారు. ఆపరేటర్లు అందరికీ ప్రమాద బీమా కల్పించాలని.. ప్రతి బస్తా బియ్యాన్ని కచ్చితమైన తూకం వేసి ఎండీయూలకు ఇవ్వాలి అంటున్నారు


మరోవైపు రాష్ట్రంలో పింఛన్ తీసుకునేవారికి మరో అలర్ట్. వైఎస్సార్‌ పింఛను కానుక కింద అందించే డబ్బులు ఈ నెల ఆలస్యం అవుతాయి. ఏప్రిల్‌ 3 నుంచి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్‌ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభం.. అలాగే 2న ఆదివారం కావడంతో బ్యాంకులు పని చేయవు. ఈ కారణంతో 3 నుంచి పింఛను పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో పింఛన్ తీసుకునేవారు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు. మరోవైపు ఈసారి బడ్జెట్‌లో పింఛన్ల కోసం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.21,434 కోట్లు కేటాయింపుల్ని ప్రతిపాదించింది ప్రభుత్వం.


అంతేకాదు ఎవరైనా తమ పింఛన్‌ను ఓ చోట నుంచి మరొక చోటకి మార్చుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. పింఛన్ తీసుకునేవారి తమ నివాసాన్ని ఒక చోట నుంచి మరో చోటికి వెళితే.. అక్కడికి పింఛన్ మార్చుకునే అవకాశం ఉంటుంది. లబ్ధిదారులు పింఛన్ మార్చుకునేందుకు వివరాలతో గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో లబ్ధిదారులు చాలా ఈజీగా పింఛన్‌ను మార్చుకునే విధానం తీసుకొచ్చారు.


పింఛన్ల విషయంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్నారు అధికారులు. అర్హత లేకపోయినా పింఛన్ మంజూరు చేస్తే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటారు. అనర్హులకు పింఛన్ ఇస్తే ఆ డబ్బుల్ని మంజూరు చేసిన వారి నుంచి రికవర్ చేస్తారు. పింఛన్లకు ఇవ్వాల్సిన సొమ్మును దుర్వినియోగం చేసినా చర్యలు తప్పవు. పింఛన్ పంపిణీ చేయగా మిగిలిన డబ్బుల్ని అకౌంట్‌లో జమ చేయాల్సిందే. అలా చేయకపోయినా సరే కఠిన చర్యలు తీసుకుంటారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa