ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 02, 2023, 08:44 AM

తాడిపత్రి పట్టణంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ నాగరాజు శనివారం తెలిపారు. పట్టణంలోని 10 పరీక్ష కేంద్రాల్లో 2, 686 మంది రెగ్యులర్, ప్రయివేటు విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. టైలర్ కాలనీలోని మున్సిపల్ ప్రకాశం ఉన్నత పాఠశాలలో 260 మంది, శ్రీనివాసపురం శ్రీ సుధా శ్రీరాములు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 260 మంది, మెయిన్ బజార్ లోని మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో 220 మంది, సుంకులమ్మపా లెంలోని చర్చి స్కూలులో 200 మంది, సంజీవనగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 240 మంది, సంజీవనగర్ లోని సాయి విజేత స్కూలులో 309 మంది, కాల్వగడ్డ వీధిలోని శ్రీ చైతన్య పాఠశాలలో 300 మంది, బుక్కపట్నం వీధిలోని నారాయణ స్కూలులో 307 మంది, యల్లనూరు రోడ్డు శ్రీవాణి స్కూలులో 299 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa