ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండ సమీపంలో ఆర్టీసీ బస్సులో రూ. 38 లక్షలు విలువ చేసే 850 గ్రాముల బంగారం, రూ. 2 లక్షలు నగదు చోరీకి గురైంది. పోలీసుల వివరాలు ప్రకారం నెల్లూరుకు చెందిన బంగారు నగలు వ్యాపారి శ్రీపాల్ జైన్ బంగారు వస్తువులు తయారు చేసి రాజమండ్రి, నరసాపురం, పాలకొల్లు ప్రాంతాల్లోని బంగారు షాపులకు సరఫరా చేస్తుంటారు. ఇదే క్రమంలో బంగారు వ్యాపారితో పాటు అతని గుమస్తా కలిసి గత నెల 26న బంగారం తీసుకుని షాపులకు ఇచ్చేందుకు బయలు దేరారు. 27న బంగారు వ్యాపారి రాజమండ్రిలో ఉండిపోయి అతని గుమస్తా ఆర్డర్ ఇచ్చిన బంగారు వస్తువులను తీసుకుని నరసాపురం వెళ్లాడు. అక్కడ పని చూసుకొని పాలకొల్లు వచ్చాడు. పాలకొల్లు నుంచి రాజమండ్రి ఆర్టీసీ బస్సులో బయలు దేరాడు. పెనుగొండ బస్టాండ్ దాటిన తరువాత సిద్దాంతం రోడ్డులో గుమస్తా దగ్గరున్న బ్యాగ్ చూసుకొనే సరికి బ్యాగ్ కనిపించకపోవడంతో వెంటనే ఈ విషయాన్ని నగలు వ్యాపారికి సమాచారం అందించారు. దీంతో గత నెల 28న పెనుగొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలో రూ. 38 లక్షలు విలువ చేసే 850 గ్రాముల వివిధ రకాల బంగారు వస్తువులు రూ.2లక్షల నగదు ఉన్న బ్యాగ్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు బంగారు వ్యాపారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై దర్యాప్తు చేసి దొంగలను పట్టుకుంటామని ఎస్ఐ రమేష్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa