ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళగిరిలో ఆలయాన్ని దర్శించుకున్న జస్టిస్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 03, 2023, 01:38 PM

 ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరు జిల్లా మంగళగిరిలోని మంగళాద్రి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. దిగువ సన్నిధిలోని తూర్పు రాజగోపురం వద్ద దేవస్థానం అధికారులు, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం శ్రీలక్ష్మీనృసింహస్వామి, శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకున్న న్యాయమూర్తి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ దేవరాయ ముఖమండపంలో అర్చకస్వాములు వారికి ఆశీర్వచనాలు అందజేసి క్షేత్ర మహత్మ్యాన్ని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa