ఓబులదేవర చెరువు స్థానిక జెవివి కార్యాలయంలో బుధవారం జాతీయ సమతా దినోత్సవం సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నాయకులు జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి సామాజిక కార్యకర్త గౌస్ లాజమ్ మాట్లాడుతూ కుల అణచి వేతలు, గుడ్డి ద్వేషాలు, అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సామాజిక సంస్కరణోద్యమాలతో జగ్జీవన్ రామ్ విశిష్టమైన స్థానాన్ని పదిల పరుచుకున్నారు. అణగారిన సామాజిక వర్గాల అభ్యున్నతికి అందించిన ప్రతి అవకాశాన్ని పనిమొట్టుగా మలుచుకున్నారు అని, జీవితకాలం అంతా అణగారిన వర్గాల హక్కుల కోసం నవ సమాజ స్థాపన కోసం పాటుపడిన గొప్ప సమత వాదీ యువతకు ఉత్తేజం మచ్చలేని నిస్వార్థ నాయకుడిగా భారతావనిలో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, నాగరాజు, వెంకట చలమయ్య, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa