ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబుతో పవనే కాదు నేను కూడా కలిశా...కానీ జనసేనతోనే పొత్తు: సోమువీర్రాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 05, 2023, 10:23 PM

చంద్రబాబుతో పవనే కాదు.. తానూ వివిధ సందర్భాల్లో  నేను కూడా భేటీ అయ్యానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. 


 మూడో విషయం గురించి మాట్లాడను.. జనసేనతో కలిసి మాత్రమే ఉన్నామన్నారు. చంద్రబాబును కలిసిన వెంటనే పొత్తు ఉందంటే ఎలా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో వివిధ పార్టీల నేతలు కలవడమనేది సర్వ సాధారణం.. ఎవ్వరూ కంగారు పడాల్సిన పని లేదన్నారు.


వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక.. ఆలయాలపై దాడులు పెద్ద ఎత్తున జరిగాయన్నారు. ఏపీలో హైంధవ ధర్మం అపహస్యం అవుతోందని.. ఫిరంగిపురంలో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదన్నారు. హిందూమతంపై దాడులు జరుగుతోంటే ఒక్క అరెస్టైనా జరిగిందా అని మండిపడ్డారు. ఏపీలో ఎంతో మందిని అరెస్ట్ చేస్తున్నారు.. కానీ దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం లేదన్నారు. ఫిరంగిపురంలో వినాయక విగ్రహం ధ్వంసం వెనుక కుట్ర ఉందన్నారు. ప్రభుత్వం తీరు మారకుంటే.. కపిల తీర్థం నుంచి రామ తీర్థం వరకు యాత్ర చేపడతామన్నారు వీర్రాజు.


తెలంగాణలో బండి సంజయ్ అరెస్ట్ దారుణమన్నారు సోము. పరీక్ష లీకేజీ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమని..పేపర్ లీకేజీ ఘటనకు బండి సంజయ్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. అవినీతి సంపదతో దేశ రాజకీయాలు నడిపే ప్రయత్నం చేస్తున్నారని.. ఆప్, బీఆర్ఎస్ పార్టీలు తెర మరుగు కావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ కుట్రకు బీజేపీ భయపడదు.. ఎదుర్కొంటుంది అన్నారు. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటూ ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ టూర్‌లో బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. ఏపీలో రాజకీయ పరిణామాలతో పాటూ పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.వైఎస్సార్‌సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్మన్నారు పవన్ కళ్యాణ్. వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓటును చీలకుండా ముందుకు వెళుతున్నామని.. రాష్ట్రంలో గొడవలు, అవినీతిపై బీజేపీ అగ్ర నేతలతో చర్చించినట్లు తెలిపారు. బీజేపీ నేతలతో జరిపిన చర్చలు రాబోయే రోజుల్లో బలమైన సత్ఫలితాలు ఇస్తాయి. వచ్చే ఎన్నికలు కచ్చితంగా రాష్ట్రానికి విముక్తి కలుగుతుంది అన్నారు. అధికారం సాధించడానికే తాము అడుగులు వేస్తున్నాము అన్నారు. మిగిలిన పార్టీలతో పొత్తుల వరకు ఇంకా వెళ్లలేదన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa