ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ కోసం గొడవపడి చివరకు ప్రాణాలమీదకు తెచ్చుకొంది

national |  Suryaa Desk  | Published : Thu, Apr 06, 2023, 06:34 PM

మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో 18 ఏళ్ల యువతి తన తమ్ముడితో గొడవపడింది. ఫోన్ కోసం ఇద్దరూ ఫైటింగ్‌కు దిగారు. వీరిద్దరి మధ్య మొదలైన గొడవకు అస్సలు పరిష్కారం లభించలేదు. దీంతో యువతికి ఆవేశం పెరిగింది. గొడవకు కారణమైన ఫోన్‌ను తీసుకుని మింగేసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు.


అయితే.. సెల్‌ఫోన్‌ మింగిన వెంటనే యువతికి విపరీతమైన కడుపునొప్పి, వాంతులు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను గ్వాలియర్స్‌లోని జయరోగ్య ఆసుపత్రి కి తరలించారు. డాక్టర్ ప్రశాంత్ శ్రీవాస్తవ, డాక్టర్ ప్రశాంత్ పిపారియా, యూనిట్ ఇన్‌ఛార్జ్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నవీన్ కుష్వాహ.. యువతికి పరీక్షలు నిర్వహించారు. యువతి పొట్టలో సెల్ ఫోన్ చూసి షాకయ్యారు.


అల్ట్రాసౌండ్, ఎక్స్-రే, సీటి స్కాన్‌తో సహా క్షుణ్ణంగా పరీక్షించారు. ఆ తర్వాత ఎండోస్కోపీ లేదా లాపరోస్కోపీ వంటి ఇన్వాసివ్ పద్ధతుల ద్వారా సెల్ ఫోన్ బయటకు తీయొచ్చని అంచనాకు వచ్చారు. వెంటనే ఆపరేషన్ చేశారు. దాదాపు రెండు గంటలపాటు శ్రమించి యువతి కడుపులో నుంచి ఫోన్‌ను బయటకు తీశారు. ఆ యువతికి 10 కుట్లు వేశామని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.


అయితే.. సదరు యువతి సెల్ ఫోన్ మింగేయడంపై వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దశాబ్దాల తన అనుభవంలో.. ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని డాక్టర్ కుష్వాహా వ్యాఖ్యానించారు. పిల్లలకు సెల్ ఫోన్‌ను ఇచ్చే విషయంలో పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లేకపోతే.. ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa