ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ...బీజేపీని కలిపే ప్రయత్నం పవన్ చేస్తున్నాడు: కె.నారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 06, 2023, 07:03 PM

ఆంద్రప్రదేశ్ ద్రోహి బీజేపీ.. వాళ్లకు ఓటు బ్యాంకు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వెల్లడించారు. పవన్ టీడీపీ, బీజేపీని కలిపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మంతనాలు అందుకే చేస్తున్నారని.. వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఓట్లు చీల్చకుండా కలిసి ఐక్యంగా ఉండటమే లక్ష్యమన్నారు. ఆ సాధ్యాలపై పెద్దలతో మాట్లాడుతున్నారని.. టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ భావనగా చెప్పుకొచ్చారు.


బీజేపీ మాత్రం ఒప్పుకోం.. రెండు పార్టీలు (జనసేన, బీజేపీ)లు మాత్రమే కలిసి పనిచేసుకుందామని.. మూడో వాళ్లు ఎందుకంటోంది అన్నారు. ఇద్దరు మధ్య ప్రేమ ఉండాలి కానీ మూడోవాళ్లు ఎందుకనేది వాళ్ల భావన కావొచ్చన్నారు. పవన్ కళ్యాణ్ కష్టపడి పనిచేస్తున్నారు అందుకు అభినందిస్తున్నా.. కానీ రాజకీయ లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ, పవన్ కళ్యాణ్, టీడీపీ కలిస్తే జగన్‌‌ నెత్తిన పాలు పోసినట్లే అన్నారు.


బీజేపీ ఏపీకి శత్రువు, వ్యతిరేకం.. విభజన చట్టం అమలు చేయలేదు, రాజధాని, పోలవరంకు శత్రువు.. ఫండ్స్ ఇవ్వలేదన్నారు. వారితో కలిసి ఎన్నికలకు వెళితే ఫలితాలు ఉండవని.. ఫలితాలు రావాలంటే బీజేపీకి వ్యతిరేకమైన పద్దతి ఉండాలన్నారు. పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు చేయనివ్వండి.. ఎప్పటికైనా బీజేపీతో కలిసి వెళ్లడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు నారాయణ.


గతంలో కూడా వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలతో కలిసి పోటీ చేయాలని నారాయణ వ్యాఖ్యానించారు. పొత్తులు మాత్రమే కాదని.. తమ ఓట్లు తీసుకుంటే సీట్లు కూడా ఇవ్వాల్సిందే అన్నారు. జనసేన, టీడీపీలతో కలిసి పోటీ చేయడంపైనా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. తమకు సీట్లు కావాలని హింట్ ఇచ్చారు నారాయణ. అయితే బీజేపీతో లేకుండా పొత్తులు ఉండాలంటున్నారు.


మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటూ పర్యటించిన సంగతి తెలిసిందే. హస్తినలో బీజేపీ పేద్దలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులతో పాటూ ఏపీలో రాజకీయ పరిణామాలపై చర్చించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వని జనసేనాని మరోసారి వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ ముక్త్ ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తానని.. అలాగే తాను సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలియజేస్తాను అన్నారు. ముందుగా తమను తాము సంస్థాగతంగా బలపడాలని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ చర్చల్లో పొత్తుల అంశం ప్రతిపాదనలు, చర్చ ప్రస్తుతం జరగలేదన్నారు. అధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని.. అందుకు తగినట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa