కన్నడ చిత్రసీమకు చెందిన స్టార్ హీరో కిచ్చ సుదీప్.. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి మద్దతు ప్రకటించారు. దీనిపై.. దక్షిణాదిలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కిచ్చ సుదీప్ ప్రకటనతో దిగ్భ్రాంతికి గురయ్యానని.. ఎంతో బాధపడ్డానని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. నిరాశలో కూరుకుపోయిన బీజేపీనే ఈ నకిలీ వార్తను వ్యాప్తి చేసిందని బలంగా నమ్ముతున్నట్టు వెల్లడించారు. కిచ్చ సుదీప్ ఒకరి ఎరలో పడేంత అమాయకుడు కాదని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
కిచ్చ సుదీప్.. సీఎం బొమ్మైతో కలిసి బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. తాను బొమ్మైకి మద్దతు ప్రకటించేందుకు వచ్చాని ప్రకటించారు. ఆయన తనకు గాడ్ఫాదర్ లాంటి వారని స్పష్టం చేశారు. బొమ్మైని తాను ప్రేమతో 'మామా'.. అని పిలుచుకుంటానని చెప్పారు. తాను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రి బొమ్మై అండగా నిలిచారని వివరించారు. కేవలం బొమ్మైకి మాత్రమే కాదని.. ఆయన సూచించిన వారి తరఫున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.
అయితే.. సుదీప్ బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. దీన్ని సుదీప్ ఖండించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తాను కేవలం బొమ్మైకి, ఆయన సూచించిన వారికే సపోర్ట్ చేస్తానని చెప్పారు. దీనిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవలే షెడ్యూల్ విడులైంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 10న పోలింగ్, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలను ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa