ఏపీలో అనాథ బాలల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ అద్భుత పథకాన్ని తీసుకొచ్చాయి. తల్లిదండ్రులను కోల్పోయిన, నిరాదరణకు గురైన, నిరాశ్రయులైన 18 ఏళ్లలోపు అనాథ పిల్లలకు మిషన్ వాత్సల్య కింద నెలకు రూ.4 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. అర్హులైన వారు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. అనాథ బాలల గుర్తింపులో ఉపాధ్యాయులు.. గ్రామ, వార్డు సచివాలయం అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, వాలంటీర్లు భాగస్వాములు కావాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా.. బాలల రక్షణ విభాగం ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 60:40 నిష్పత్తిలో నిధులు ఇస్తారు. అంటే కేంద్రం రూ.2,400 అందజేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.1600 ఇస్తోంది. సంరక్షణ లేని పిల్లలు.. ఆదరణ అవసరమైన పిల్లలు.. వారి తల్లిదండ్రుల రక్త సంబంధీకులు సంరక్షకులతో ఉంటూ విద్యను కొనసాగించేందుకు స్పాన్సర్షిప్గా అందజేస్తున్నారు.
అనాథ పిల్లలు వాత్సల్య పథకం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సీడీపీవోలు, సూపర్వైజర్లకు అర్హులైన పిల్లల దరఖాస్తులకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్ చైర్ పర్సన్గా జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి, సీడబ్ల్యూసీ అధికారి, డీసీపీఓ, ఎన్ఐసీ పీఓ, శిశు గృహ సంక్షేమాధికారి, ఒక ఎన్జీఓ అధికారి, సభ్యుల పర్యవేక్షణలో అర్హుల ఎంపిక ఉంటుంది. అర్హులు సంబంధిత గ్రామ, వార్డు సరివాలయ పరిధిలోని మహిళా పోలీసులను కలిసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
నిరుపేద నిస్సహాయ స్థితిలో 18 ఏళ్లలోపు వారు పిల్లలు అర్హులు.. వారికి నెలకు రూ.4 వేల చొప్పున సాయం అందిస్తారు. వితంతు, విడాకులు తీసుకున్న తల్లీ పిల్లలు.. తల్లిదండ్రులు కోల్పోయి ఇతర కుటుంబాల్లో నివసిస్తున్న అనాథ పిల్లలు.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు అర్హులు. అలాగే పిల్లలను పెంచలేని స్థితిలో ఉన్న వారి బాలలు.. బాల కార్మికులు, బాల్య వివాహాల అక్రమ రవాణాకు గురైన వారు హెచ్ఐవీ బాధితుల పిల్లలు అర్హులు.
బాల న్యాయ (రక్షణ, ఆదరణ చట్టం) 2015 ప్రకారం ఆదరణ అవసరమైన చిన్నారులకు కూడా అవకాశం ఉంది. వికలాంగులు, తప్పిపోయిన, వీధుల్లో నివసిస్తున్న పిల్లలు, పారిపోయిన పిల్లలు, యాచకుల పిల్లలు.. హింసకు, దోపిడీకి గురైన పిల్లలు, అనాథ ఆశ్రమాల్లో ఉన్న బాలలు, పీఎంకేర్ ఫర్ చిల్డ్రన్ పథకం పొందుతున్న చిన్నారులు అర్హులు. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 96 వేలు మించకూడదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa