ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనుగోలు కోసం ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు చేసేందుకు ఈ నెల 27న బిడ్లు ఆహ్వానించారు. దీనిపై స్పందించిన కేసీఆర్ సర్కార్ తాము సింగరేణి లేదా నీటిపారుదల అభివృద్ధి సంస్ధ తరఫున బిడ్లు వేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు బిడ్ వేయాలన్న కేసీఆర్ సర్కార్ నిర్ణయం బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. అదే జరిగితే బీజేపీతో పాటు ఆ పార్టీకి మద్దతిస్తున్న ప్రాంతీయ పార్టీలకు చుక్కలు కనపడడం ఖాయం. జేఎస్ రంజన్ నేతృత్వంలో బిడ్డింగ్ కు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బిడ్డింగ్కు ప్రణాళికలు చేస్తున్నారు.
ఇప్పటికే, తెలంగాణలో సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకించిన బీఆర్ఎస్. ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది బీఆర్ఎస్. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేయనుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నాచేస్తున్న కార్మికులకు మద్దతు తెలపనుంది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఇప్పటికే విశాఖ ఉక్కు కార్మికులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ స్ట్రాటెజీ ఏపీ పొలిటికల్ వర్గాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. అయితే, మున్ముందు ప్రణాళిక, కార్యచరణ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa