విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో అందరి కంటే ఎక్కువగా స్పందించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నాయకులకు పైత్యం ఎక్కువైందని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీకి సీపీఐ, సీపీఎం నాయకులు కూడా జత కలిశారని ఫైరయ్యారు. అసలు కమ్యూనిస్టు పార్టీ నాయకులకు ఏమైందని ప్రశ్నించారు. సంస్కరణల పేరుతో చంద్రబాబు గతంలో ఎన్నో ప్రభుత్వ సంస్థలు మూసివేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణలో చంద్రబాబునాయుడు ఛాంపియన్ అని ఎవరిని అడిగినా చెబుతారని పేర్కొన్నారు.
ఇక, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో అందరి కంటే ఎక్కువగా స్పందించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ మాటల అర్థం కూడా ఇదే అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఏ విధంగా రక్షించుకోవచ్చు అనే అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని సూచనలు చేశారని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరారని గుర్తు చేశారు. అలాగే, స్టీల్ ప్లాంట్కు ఉన్న 7,000 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి ఆర్థికంగా ప్లాంట్ను ఆదుకోవచ్చు అనేది ఒక ప్రతిపాదనగా ఉందన్నారు. ఎవరినో మభ్య పెట్టటానికి తాము ఈ పోరాటం చేయటం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా విజయం సాధించటమే గొప్ప అని.. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి, అదే దారిలో ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు.
అయితే, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ అసలు కేంద్ర ప్రకటనలో ఏముందో చూడరా? అని సజ్జల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డింగ్లో తెలంగాణ ప్రభుత్వం, ఇతర సంస్థలకు పాల్గొనే అవకాశం ఉందా అనేది గమనించరా? అని నిలదీశఆరు. పరిమితమైన కార్యకలాపాల కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసిందని.. అయినా కూడా దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు.
అసలు, ప్రైవేటీకరణ ఛాంపియన్ చంద్రబాబు అని చిన్న పిల్లలను అడిగినా చెబుతారని సజ్జల పేర్కొన్నారు. ‘ప్రైవేటైజేషన్ ఎ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అనే పుస్తకంలో చంద్రబాబు తన మనసులో మాట చెప్పారని.. ఇందులో సంస్కరణల పేరుతో ఎన్ని ప్రభుత్వరంగ సంస్థలను మూసేశారో వివరించారన్నారు. ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్న కంపెనీల జాబితాను కూడా సిద్ధం చేసి ఉంచారని వివరించారు. ఇక, జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వ లేకపోతున్నాయని, అందుకే దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనుకునే బ్యాచ్ వ్యవహారం మరింత దారుణంగా మారిందని ఫైరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa