మండల కేంద్రమైన లింగసముద్రంలోని సచివాలయం-2 పరిధిలో ఉన్న బలిజిపాలెం, రామకృష్ణాపురం, జంగంరెడ్డి పాలెం, ఎస్టి కాలనీలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం ఉదయం ప్రారంభించారు. కందుకూరి శాసనసభ్యులు మనుగుంట మహేందర్ రెడ్డి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిర్వహించడంతోపాటు పథకాలలో వారు లబ్ధి పొందిన వివరాలను తెలియజేశారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు పెన్నా కృష్ణయ్య, జడ్పిటిసి సభ్యులు డాక్టర్ చెన్ను నలిని పద్మ, వైసీపీ మండల కన్వీనర్ పిచ్చపాటి తిరుపతిరెడ్డి, జెసిఎస్ కన్వీనర్ వరికుటి కృష్ణారెడ్డి, ఎంపీడీవో శ్యాంబాబు. తహసిల్దార్ సుధాకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ రాఘవులు, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa