ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 14, 2023, 11:27 AM

రెడ్డిగూడెం మండల ప్రధాన సెంటర్ నందు ఆటో యూనియన్ ఎమ్మార్పీఎస్ దళిత సంఘాల ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 132వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవ రత్న నేషనల్ అవార్డు గ్రహీత సీనియర్ పాత్రికేయులు హ్యూమన్ రైట్స్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ మల్లాది ప్రసాదరావు పాల్గొని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ అని ఆయన పేర్కొన్నారు. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్. దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమ న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారు. నేడు (ఏప్రిల్ 14) అంబేద్కర్ జయంతిని పురస్కరిం చుకుని యావత్ భారతావని ఆయన దేశానికి అందించిన విలువైన సేవలను స్మరించుకోవటం మనందరి బాధ్యత అని ప్రసాదరావు అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్పూర్తితో అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని అన్నారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాజ్యాంగాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని రాజ్యాంగం లేకపోతే యావత్ మానవాళికి రక్షణ లేదని రాజ్యాంగాన్ని రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు పై ఉందని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa