ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో ఐదు నెలల్లో నూతన సంస్కరణలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2017, 10:48 AM

న్యూఢిల్లీ: బీసీసీఐలో లోధా ప్యానెల్‌ సూచించిన నూతన సంస్కరణలు మరో నాలుగైదు నెలల్లో పూర్తిగా అమలవుతాయని పరిపాలక కమిటీ (సీఓఏ) పేర్కొంది. ‘కోర్టు సూచించినట్టుగా బోర్డు పూర్తి ప్రక్షాళన వీలైనంత త్వరగా చేసేలా ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా నూతన నిర్మాణం, ఆర్థిక విధానం, పరిపాలన పారదర్శకంగా ఉండేలా వ్యవస్థను రూపొందిస్తాం. ఇదంతా సుదీర్ఘంగా కాకుండా వచ్చే నాలుగు లేదా ఐదు నెలల్లోనే పూర్తవుతుంది’ అని నలుగురి సభ్యులతో కూడిన సీఓఏకు నేతృత్వం వహిస్తున్న వినోద్‌ రాయ్‌ తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం భారత్‌లో క్రికెట్‌ జరిగేందుకు ఎలాంటి అడ్డంకి లేదని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa