నెల్లూరు జిల్లా, మనుబోలు పరిధిలోని కామాక్షితాయి సంగమేశ్వరుడి కల్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ యాజ్ఞికులు అవధానం జయసింహశర్మ, అర్చకులు సర్వేపల్లి ఫణీంధ్రశర్మలు వేదమంత్రాలతో ఈ వేడుకను నిర్వహించారు. ఈ ఏడాది కొత్తగా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఉత్సవర్లకు పట్టువస్త్రాలు అందజేశారు. స్వామి కల్యాణం జరిగే సమయంలో 10 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. తరలివచ్చిన భక్తులకు గ్రామస్థులు అన్నదానం చేశారు. సాయంత్రం తేరులో కల్యాణ దంపతులను ఉంచి తీర్థవాదికి (చక్రస్నానం) తీసుకెళ్లారు. అనంతరం ధ్వజా అవరోహణ కార్యక్రమం ముగించి సంగమేశ్వరాలయం నుంచి రథోత్సవం మనుబోలు శివాలయం వరకు సాగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa